అలర్ట్ : దేశంలోకి నలుగురు ఉగ్రవాదులు

దేశంలోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడ్డారు. ఎప్పుడు, ఎక్కడైనా ఉగ్రదాడులకి పాల్పడొచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. రాజస్థాన్ సిరోహి జిల్లా ఎస్పీ ఈ హెచ్చరికలు చేశారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఏజెంట్ సహా మరో నలుగురు అనుమానితులు గుట్టుచప్పుడు కాకుండా దేశంలో చొరబడ్డారని ఎస్పీ తెలిపారు.

ఈ నేపథ్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులతోపాటు ఇతర ప్రాంతాల్లోని హోటళ్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పకడ్బందీ తనిఖీలు జరపాలని ఎస్పీ సూచించారు. ఈ నేపథ్యంలో దేశంలో భద్రతని మరింత కట్టుదిట్టం చేసింది పోలీస్ శాఖ. హైదరాబాద్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్టికల్ 370, కశ్మీర్ విభజన నేపథ్యంలో భారత్ లో దాడులు చేసి.. ఉద్రిక్తపరిస్థితులు సృష్టించడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెంట్ వర్గాలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.