ప్రభాస్-అనుష్క అమెరికాలో కాపురం.. !

స్వీటీ అనుష్కతో ప్రభాస్ అమెరికాలో కాపురం పెట్టబోతున్నాడు. ఇందుకోసం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఇంటి కోసం వెతుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై సాహో ప్రమోషన్స్ పాల్గొన్న ప్రభాస్ స్పందించారు. అనుష్కతో అమెరికాలో కాపురంపై ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రభాస్ ని ప్రశ్నించింది. దీనికి ప్రభాస్ పాత సమాధానమే కొత్తగా చెప్పారు. అనుష్క తనకి చాన్నాళ్లుగా తెలుసు. అందరూ అనుకుంటున్నట్టు తమ మధ్య ఏమీ లేదు.

నిజంగానే తమ మధ్య ఏమైనా ఉంటే.. గత రెండేళ్లలో ఎక్కడో ఒకచోట మీడియా దొరికిపోయేవాళ్లం కదా. ఇదొక రూమర్ మాత్రమే. ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే ఇంతకాలం దాచి ఉంచడం సాధ్యపడే విషయం కాదన్నాడు ప్రభాస్. ఐతే, సాహో దుబాయ్ షెడ్యూల్ లో ప్రభాస్ గాయపడితే.. అనుష్క హుఠాహుఠిన అక్కడికి వెళ్లి ప్రభాస్ ని పరామర్శించిన విషయం నిజం కాదని గాసిప్ రాయుళ్లు అంటున్నారు. ఇకపై రిస్క్ యాక్షన్స్ సీన్స్ చేయొద్దని స్వీటీ సూచించిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయ్.

సుజీత్ దర్శకత్వంలో సాహ్ తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.