రాజ్ తరుణ్ కారు యాక్సిండెట్.. ఓ బిగ్ డీల్ !


టాలీవుడ్ కుర్ర హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం వ్యవహారంలో.. బిగ్ ట్విస్ట్. ఏటంటే.. ? ఈ ప్రమాదాన్ని క్యాష్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయట. దీనిపై నటుడు, రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర గురువారం పోలీసులకి ఫిర్యాదు చేశారు.

కారు ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ భయంతో కారుని అక్కడే వదిలేసి పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రమాదం జరిగింది హీరో తరుణ్ కి అని అందరు భావించారు. టీవీ ఛానెల్స్ ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. ఈ వార్తలని తరుణ్ ఖండించారు. ఆ తర్వాత తెలిసింది కారు ప్రమాదం జరిగింది తరుణ్ కి కాదు రాజ్ తరుణ్ కి అని. ఆ మరుసటి రాజు ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా రాజ్ తరుణ్ స్పందించారు. అభిమానులతో ట్విట్టర్ లో ఛాట్ కూడా చేశారు. ప్రమాదంపై వివరణ కూడా ఇచ్చారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ప్రమాదంలో ఓ ట్విస్ట్ కూడా ఉంది. ప్రమాదం జరిగిన వీడియా తన దగ్గర ఉంది. రూ. 5లక్షలు ఇవ్వాలి లేదంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకి పాల్పడ్డాడట డిజైనర్ కార్తీక్. ఇంతకీ ఆ వీడియా కార్తీక్ దగ్గరికి ఎలా వచ్చింది ? ఐతే, ప్రమాదం జరిగిన తర్వత రాజ్ తరుణ్ పరుగెడుతున్న సమయంలో కార్తీక్ అక్కడే ఉన్నాడు. అప్పుడే ఆ వీడియో తీశారని చెబుతున్నారు. ఇప్పుడీ వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరింది.