‘సాహో’కు అరుదైన గౌరవం


‘సాహో’ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ అత్యధిక లైకులు సొంతం చేసుకొన్న తెలుగు సినిమా ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ట్రైలర్ విడుదలైన 24గంటల్లోనే దాదాపు 5 లక్షల లైకులని సొంతం చేసుకొంది. తాజాగా సాహోకు అరుదైన గౌరవం దక్కింది. సాహో కోసం ట్విట్టర్ ఎమోజీలని తయారు చేస్తోంది. ఇప్పటివరకు ఎవెంజర్స్, ది లయన్ కింగ్, స్పైడర్ మాన్, బాలీవుడ్ సినిమా ‘భారత్’ సినిమాలకు ఆ గౌరవం దక్కింది. ఇప్పుడీ లిస్టులో సాహో చేరనుంది.

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో సాహో భారీ ఎత్తున విడుదల కానుంది.