‘బాబు అండ్ కో’ కడుపు మంటకు కారణమిదే.. !


ఏపీ రాజధాని అమరావతి విషయంలో అగ్గిరాల్చారు మంత్రి బొత్స. రాజధాని అమరావతి విషయంపై ప్రభుత్వంలో చర్చ సాగుతుంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం తీసుకోనుంది. రాజధానిగా అమరావతి సేఫ్ కాదని మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేడెక్కింది. రాజధాని తరలింపుపై వస్తున్న వార్తలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి విషయంలో చంద్రబాబు అండో కో చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్విట్ చేశారు.”అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, “కావాల్సిన” వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు” అని రాసుకొచ్చారు.

తన ట్విట్ లో విజయసాయి పేర్కొన్న పేర్లల్లో తెదేపా అధినేత చంద్రబాబు బినామీలుగా ముద్రపడినవే వారి పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వారు బీజేపీలో ఉన్నారు. కానీ ఏపీ రాజధాని విషయంలో వారు టీడీపీ నేతల మాదిరిగానే మాట్లాడటం విశేషం. బహుశా.. ఇటీవలే తెదేపా వదిలి భాజాపాలో చేరిన ఆ ఇద్దరి నేతలకి ఇంకా బీజేపీ నీళ్లు పడలేనట్టున్నాయ్. ఇంకా పచ్చ పార్టీ నేతలుగానే భావిస్తున్నట్టున్నారు.. !