సాహో కొత్త పోస్టర్.. కేక !

బాహుబలి ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకుడు. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఇప్పటికే సాహో సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సాహో ప్రమోషన్స్ ని పీక్స్ తీసుకెళ్లే పనిలో చిత్రబృందం.

హీరోయిన్ శ్రద్దా కపూర్ తో కలిసి ప్రభాస్ బాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం సాహో ఫేస్ బుక్, ఇన్ స్ట్రోగ్రామ్, స్నాప్ ఛాట్ ఖాతాలని తెరిచారు. ఇదిలావుంటే తాజాగా సాహో నుంచి మరో రొమాంటిక్ పోస్టర్ ని షేర్ చేసింది శ్రద్దా కపూర్. సాహో రిలీజ్ కౌంట్ డౌన్ పోస్టర్ గా దీన్ని పేర్కొంది. సాహోలో యాక్షన్, రొమాన్స్, థ్రిల్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని పేర్కొంది.