సోషల్ మీడియాలోకి ‘సాహో’ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇదే. ఈ నేపథ్యంలో సాహో పై భారీ అంచనాలున్నాయి. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో ప్రమోషన్స్ పీక్స్ కి తీసుకెళ్లింది చిత్రబృందం. బాలీవుడ్ లో సాహో ప్రమోషన్స్ పై ప్రభాస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. హీరోయిన్ శ్రద్దా కపూర్ తో కలిసి బాలీవుడ్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ప్రభాస్.

మరోవైపు, సోషల్ మీడియాలో సాహో అప్ డేట్స్ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇప్పటికే సాహో సినిమా కోసం ట్విట్టర్ లో ఖాతా ఓపెన్ చేశారు. తాజాగా ఫేస్ బుక్, ఇన్ స్ట్రోగ్రామ్, స్నాప్ షాట్ లలోనూ ఖాతా తెరిచారు. ఇకపై సాహో అప్ డేట్స్ వీటిలో చూడొచ్చు. సాహో సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ ని పొందింది.

Facebook : http://bit.ly/SaahoFacebook
Instagram : http://bit.ly/SaahoInstagram
Snapchat : http://bit.ly/SaahoSnapchat

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో సాహో భారీ ఎత్తున విడుదల కానుంది.