తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం


విండీస్ టూర్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టీ20, వన్డే సిరీస్ లని క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. బుమ్రాతో (5/7) పాటు పేస్‌ బౌలర్లు ఇషాంత్‌ శర్మ(3/31), షమి(2/13) చెలరేగడంతో 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ 100 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాట్స్ మెన్స్ లో కీమర్‌ రోచ్‌(38; 31బంతుల్లో 1×4, 5×6) ఒక్కడే పర్వాలేదనిపించాడు.

అంతకుముందు 185/3తో నాలుగో రోజు ఆటని ప్రారంభించిన భారత్‌ మరో 158 పరుగులు జోడించి 343/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అజింక్య రహానె(102; 242 బంతుల్లో 5×4) శతకం సాధించగా.. హనుమ విహారి(93; 128బంతుల్లో 10×4, 1×6) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు శుక్రవారం కింగ్‌స్టన్‌లో ప్రారంభం కానుంది.