అఖిల్ తో పరశురామ్.. ప్రచారం మాత్రమే !


‘గీత గోవిందం’ లాంటి వందకోట్ల సినిమా అందించిన దర్శకుడు పరశురామ్. ఇలాంటి దర్శకుడు కూడా ఖాళీగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆలస్యమైనా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనే ఆలోచనలో పరశురామ్ ఉన్నారు. ఇప్పటికే పరశురామ్ కథని మహేష్ ఓకే చేశారు. కానీ సినిమా ఎప్పుడు పట్టాలకెక్కుతుందన్నది చెప్పలేం. ఎందుకైనా మంచిదని.. పరశురామ్ సేఫ్ గా అదే కథని ఎన్టీఆర్ కి కూడా వినిపించినట్టు తెలిసింది. మహేశ్ కాకుంటే తారక్ తో చేయాలన్నది ప్లాన్.

ఇంతలో పరశురామ్ రామ్ కి మహేష్ హ్యాండిచ్చాడు. తారక్ తో సినిమా ఇప్పట్లో కుదిరే పని కాదు. ఈ నేపథ్యంలో అదే కథని అఖిల్ తో చేయడానికి పరశురామ్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాని నాగార్జున స్వయంగా నిర్మించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఐతే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజంలేదట. అఖిల్‌తో సినిమా అనే ప్ర‌తిపాద‌న త‌న ద‌గ్గ‌ర‌కేం రాలేద‌ని, త‌ను పూర్తిగా మ‌హేష్ సినిమా ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాన‌ని, ఇలాంటి వార్త‌ల్ని న‌మ్మొద్ద‌ని చెబుతున్నారు ప‌ర‌శురామ్.