‘సాహో’ ట్విస్ట్ పై ప్రభాస్ మాట

‘బాహుబలి’ తరవాత ప్రభాస్ ఇమేజ్‌ రాష్ట్రాలు దాటేసి, దేశాలు చుట్టేసింది. ఆ ఇమేజ్ కి తగ్గట్టుగానే ‘సాహో’ని తీర్చిదిద్దారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డారు. తన క్రేజ్‌ని నమ్మి యూవీ సంస్థ ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు పెట్టింది. అందుకే.. ‘సాహో’ దేశ వ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈనెల 30న సాహో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న ప్రభాస్ సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ పై ఆసక్తిర సమాధానం చెప్పారు.

సాహో’ పక్కాగా ఓ కమర్షియల్‌ సినిమా. లార్జర్‌ దేన్‌ లైఫ్‌లా ఉంటుంది.‘సాహో’లో కొన్ని సన్నివేశాలు చాలా కీలకం. ఒక్కో సన్నివేశం మళ్లీ మళ్లీ తెరపై కనిపిస్తుంటుంది. అందులోనే రకరకాల షేడ్స్‌ కనిపిస్తాయి. వాటిని తెరకెక్కించడం చాలా కష్టం. వాటిని సుజిత్‌ సమర్థంగా తెరకెక్కించాడు. ప్రచారం జరుగుతున్నట్టుగా ద్విపాత్రాభినయం కాకపోవచ్చు. కథ మొత్తం ఇప్పుడే చెప్పొచ్చు. కానీ థియేటర్‌కి వెళ్లేంత వరకూ ఆ ఉత్సుకత ఉండాలి కదా. అందుకే దాస్తున్నాం. కథ గురించి కొన్ని క్లూలు ట్రైలర్‌లో ఇచ్చేశామన్నారు.