ప్రభాస్ ఫైనల్ పంచ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ కోసం ఏం చేయాలో అంతా చేశారు. ‘బాహుబలి’ తర్వాత అభిమానులకి మరో మంచి సినిమాని అందించాలనే తపనతో సాహో కథని ఎంచుకొన్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా రెండేళ్లు కష్టపడ్డారు. సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టారు. రూ. 150కోట్లతో అనుకొన్న సాహో సినిమా ఏకంగా రూ. 350కోట్లు దాటింది. అయినా యూవీ క్రియేషన్స్ అధైర్యపడలేదు. ఎందుకంటే ? ప్రభాస్ ఉన్నాడనే నమ్మకం. ప్రభాస్ కోసమేననే ప్రేమ. ఆ నమ్మకం వమ్ము కాలేదు.

సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఇక, సినిమా ప్రమోషన్స్ ని ప్రభాస్ తన భుజస్కందాలపై మోశారు. అన్నీ బాషల్లోనూ సాహో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. బాలీవుడ్ సాహో పేరు మారుమ్రోగేలా చేశాడు. హీరోయిన్ శ్రద్దా కపూర్ తో కలిసి.. టీవీషోస్ లో పాల్గొన్నారు. స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు.

మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతున్న టైంలోనూ ప్రభాస్ ప్రమోషన్స్ ని ఆపలేదు. తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియోని రిలీజ్ చేశారు. హాయ్.. నేను ప్రభాస్. నా చిత్రం సాహో రేపు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ బాషల్లో రిలీజ్ కాబోతుంది. వెళ్లి సినిమా చూడండని రిక్వెస్ట్ చేశారు. బహుశా.. సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో ప్రభాస్ లాస్ట్ పంచ్ ఇదేనేమో.. !

బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రమిది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కూడా ఇదే.సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది.