బాలీవుడ్ స్టార్ హీరోతో షాలినీ పాండే రొమాన్స్

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ గా మారాడు. కానీ ఆయనకి జంటగా నటించిన షాలినీ పాండే మాత్రం బిజీ హీరోయిన్ కాలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత ‘మహానటి’లో అతిథి పాత్రలో మెరిసింది షాలినీ. ఇక, కల్యాణ్ రామ్-షాలినీ జంటగా నటించిన ‘118’ మంచి విజయాన్ని అందుకొంది. ఐతే స్టార్ హీరోలతో జతకట్టే ఛాన్స్ మాత్రం షాలినీకి రాలేదు.

టాలీవుడ్ సంగతి పక్కనపెడితే బాలీవుడ్ లో షాలినీ పాండే పంటపడినట్టయింది. అక్కడ ఆమె ఒకేసారి మూడు సినిమాలకి సంతకం చేసిందట. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వరుసగా మూడు భారీ సినిమాల్లో చేయడానికి డీల్ కుదుర్చుకుందని సమాచారమ్. ఇందులో ఓ సినిమాలో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ జోడీగా కనిపించనుందట. ఈ మూడు సినిమాలతో షాలినీ బాలీవుడ్ లో సెటిల్డ్ అయిపోవడం ఖాయం అంటున్నారు. మరోవైపు, విజయ్ దేవరకొండ బాలీవుడ్ సినిమా కూడా ఓకే అయినట్టు తెలుస్తోంది. దీనిపై ఈవారం ప్రకటన రావొచ్చు.