ఏపీ కేబినేట్ భేటీ : రాజధాని తరలింపుపై క్లారిటీ ఇస్తారా.. ?


ఏపీ రాజధాని అమరావతి మార్పు వ్యవహారం గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. అమరావతి అంత సేఫ్ కాదని.. రాజధాని అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీనిపై టీవీల్లో చర్చలు, రాజధాని రైతుల ఆందోళలని చూశాం. ఐతే, ఇప్పటి వరకు రాజధాని మార్పుపై జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ స్పందించలేదు.

దీనిపై నేడు జరగనున్న కేబినేట్ భేటీలో ప్రస్తావనకి వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతన ఇసుక విధానం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రివర్స్‌ టెండరింగ్‌, మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ, మత్స్యకారులకు వేటనిషేధం సమయంలో పరిహారం, రాజధాని నిర్మాణం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఐతే, రాజధాని మార్పుపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారా ? లేదంటే.. ? సమావేశం అనంతరం రాజధాని మార్పుపై క్లారిటీ ఇస్తారా ? అనేది చూడాలి.