గణేష్ మండపంలో అగ్నిప్రమాదం


గణేష్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైత్రీ నివాస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అఖండ దీపం కిందపడి మంటలు చెలరేగాయి. దాంతో పార్కింగ్ చేసిన వాహనాలు కాలి బూడిదయ్యాయి. 2 కార్లు, 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలని అదుపులోనికి తీసుకొచ్చారు.