హమ్మయ్య.. ‘సాహో’ సేఫ్ !

భారీ అంచనాలు, ఆశల మధ్య గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఐతే తొలి షోతోనే సాహో మిక్సిడ్ టాక్ సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో సాహోకి భారీ నష్టాలు తప్పవు అనుకొన్నారంతా. కానీ కేవలం ఐదు రోజుల్లోనే పెట్టుబడి తిరిగొచ్చింది. 5రోజుల్లో సాహో రూ. 350కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టు యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సాహో.. సేఫ్. ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.

టాక్ తో సంబంధం లేకుండా ‘సాహో’ని చూసేస్తున్నారు జనాలు. ప్రీమియర్ షోస్, అడ్వాన్స్ బుకింగ్స్ తో సాహో బయటపడిందని చెప్పవచ్చు. తొలివారానికి మొత్తం అడ్వాన్స్ బికింగ్స్ రూపంలో టికెట్స్ తెగాయి. ఇక బాలీవుడ్ లో సాహో రూ. 100కోట్లు దాటేసింది. ఇదీగాక పోటీలో మరో సినిమా లేకపోవడం సాహోకి బాగా కలిసొచ్చింది. ఐతే, కొన్ని చోట్ల సాహో డిజాస్టర్ అని తేలిపోయింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం సాహో హిట్ కిందే లెక్క. ఈ యేడాది ఇండియన్ బిగ్గెస్ట్ గా హిట్ గా సాహో నిలిచింది.