బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్.. శ్రీముఖికి చెక్ !

బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ శ్రీముఖి హవా కొనసాగుతోంది. ఆమె అటెన్షన్ కొట్టేస్తోంది. శ్రీముఖి అత్యుత్సాహాన్ని మిగిలిన ఇంటిసభ్యులు అడ్డురాలేక పోతున్నారు. మరోవైపు హౌస్ లో శ్రీముఖిని హైలైట్ చేసేలా ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి చెక్ పెట్టేందుకు బిగ్ బాస్ యాజమాన్యం రెండో వైల్డ్ కార్డ్ ని ప్లాన్ చేసింది. శిల్పా చక్రవర్తిని రంగంలోకి దించినట్టు అనిపిస్తోంది. శిల్పా వచ్చి రాగానే తన శత్రువు శ్రీముఖి అన్నట్టుగా ఫిక్స్ చేసుకొంది.

శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ ఆమెని నామినేట్ చేసింది. అంతేకాదు.. మంగళవారం షోలో శ్రీముఖితో శిల్పా చక్రవర్తిని పాత గొడవలున్నాయి. వారిద్దరికి అసలు పడదని.. పునర్నవి రాహుల్ తో గుసగుసలాడుతూ కనిపించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఏపీసోడ్స్ లో శ్రీముఖి-శిల్పా ల వార్ రసవత్తరంగా మారనుందని తెలుస్తోంది. ఇక మంగళవారం షోలో ‘దొంగలు దోచిన నగరం’ అనే టాస్క్ హింసాత్మకంగా సాగింది. ఇంటి సభ్యులు ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ రచ్చ చేశారు.