స్వీటీ సప్రైజ్ కాదు.. షాక్ ఇచ్చింది !


స్వీటీ అనుష్క అభిమానులకి సప్రైజ్ ఇవ్వబోతున్నట్టు కనిపించింది. ‘భాగమతి’ చాలా గ్యాప్ తీసుకొని ఆమె నటిస్తున్న చిత్రం ‘నిశబ్ధం’. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ అమెరికాలో జరిగింది. సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కూడా బయటికొచ్చాయ్. ఆ ఫోటోల్లో అనుష్క కూడా కనబడింది. కానీ ఆమె మొహం మాత్రమే చూపించింది. ఫుల్ బాడీని చూపించలేదు. ఈ నేపథ్యంలో స్వీటీ చాలా సన్నబడింది.

అభిమానులని సప్రైజ్ చేసేందుకే కెమెరా ముందుకు రావడం లేదు. కేవలం ఫేస్ ని మాత్రమే చూపిస్తోంది. త్వరలోనే నాజుక్కు లుక్ తో స్వీటీ అభిమానులని సప్రైజ్ చేయనుందని అనుకొన్నారంతా. ఇంతలో స్వీటీ షాక్ ఇచ్చింది. ఆమె ఏమాత్రం సన్నబడలేదు. ఇంకా బొద్దుగానే ఉంది. ‘నిశబ్ధం’ అమెరికా షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగొస్తుండగా.. ఎయిర్ పోర్ట్ లో స్వీటీ మీడియాకి దొరికిపోయింది. ఆమె ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. స్వీటీ ఏమాత్రం మారలేదని చెప్పుకొంటున్నారు. ‘సైజు జీరో’ సినిమా కోసం స్వీటీ సైజులు పెంచిన సంగతి తెలిసిందే

ఈ సినిమా తర్వాత సన్నబడాలని స్వీటీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. బాహుబలి 2 కోసం స్వీటీని టెక్నాలజీ ఉపయోగించి సన్నగా చూపించారు. భాగమతి కోసం కొంచెం బరువు తగ్గినా.. మళ్లీ పెరిగినట్టు తాజా పిక్స్ ని చూస్తే అర్థమవుతోంది. ఇక ఆమె తాజా చిత్రం నిశబ్ధం వైవిధ్యమైన కథతో తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.