ఎంత మందికో ఈ అదృష్టం


ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో ‘ఎంత మందికో ఈ అదృష్టం.. ‘ అంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. బ్రహ్మీ స్వయంగా తనకు భోజనం వడ్డిస్తున్న ఫొటోను హరీష్ తన ట్విటర్ లో షేర్ చేశారు. “ఎంత మందికో ఈ అదృష్టం.. సినిమాకు రుణపడి ఉన్నాను. వాల్మీకి సినిమా చివరిరోజు షూటింగ్ ఫుల్ సర్ ప్రైజ్ లతో నిండిపోయింది” అని కామెంట్ పెట్టాడు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ‘వాల్మీకి’ తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. కోలీవుడ్ కుర్ర హీరో అథర్వ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 20న వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రానుంది.