ఇస్మార్ట్ పోరీ.. బాగా పెంచేసింది !

తెలుగులో కమర్షియల్ హీరోయిన్స్ కరువయ్యారు. అందం+అభినయం తెలిసిన పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ ని స్టార్ హీరోలు వరుసపెట్టి వాడేస్తున్నారు. చిన్న, యావరేజ్ సినిమాల కోసం గ్లామర్ బ్యూటీ దొరకలాంటే కష్టమవుతోంది. ఐతే, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగు తెరకు మరో కమర్షియల్ హీరోయిన్ దొరికేసింది. నభా నటాషా ఇస్మార్ట్ హీరోయిన్ అదరగొట్టేసింది. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకొనేందుకు నభా భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్టు సమాచారమ్.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాశీ ఖన్నా కథానాయిక. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నభా నటాషాని సంప్రదించారట. కేవలం 20 కాల్షీట్ల కోసం ఆమె రూ. 70లక్షలు డిమాండ్ చేస్తుందట. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరో గ్లామర్ బ్యూటీ కోసం చూసిన నభా లాంటి నిండైన అందాల భామ దొరకడం లేదట. ఫైనల్ గా నభాని పది ఇటో అటో ఒప్పించాలని చూస్తున్నట్టు సమాచారమ్.

ప్రస్తుతం నభా వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు నభా కోసం స్టార్ హీరోయిన్స్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. వారి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకురాలేదు.