నరసింహాన్’కు ఆత్మీయ వీడ్కోలు

సుధీర్ఘకాలం పాటు తెలుగు రాష్ట్రాలకి గవర్నర్ గా పనిచేసిన నరసింహన్‌కు కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు చెప్పింది. నరసింహన్ దంపతులు ఇవాళ చెన్నై వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆత్మీయ వీడ్కోలు సభ కొనసాగుతోంది. అనంతరం నరసింహన్‌ దంపతులు బేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరనున్నారు. నరసింహన్ దంపతులకు సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు వీడ్కోలు పలకనున్నారు.తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. రేపు సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.