రామ్‌ జెఠ్మలానీ ఇకలేరు 


కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.రామ్‌ జెఠ్మలానీ అసలు పేరు రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ. ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సుల్లోని సిఖార్‌పూర్‌లో 1923 సెప్టెంబరు 14న రామ్ జెఠ్మలానీ జన్మించారు. న్యాయవాదిగా కీలకమైన కేసులని విజయవంతంగా వాదించారు. 1959 నాటి కేఎం నానావతి Vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసుతో రామ్ జెఠ్మలానీ పేరు దేశంలో మారుమ్రోగిపోయింది.
 
2011లో రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడి తరఫున మద్రాసు హైకోర్టులో వాదనలు వినిపించారు. స్టాక్ మార్కెట్ కుంభకోణం కేసులో హర్షద్ మెహతా, కేతన్ ఫరేఖ్‌‌ల తరఫున, పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు ఆఫ్జల్ గురు మరశిక్ష కేసు, జెస్సికా లాల్ హత్యకేసులో మను శర్మ ప్రతినిధిగా  ఆయన వాదించారు. ఇక తొలిసారిగా ముంబై పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున 6వ లోక్‌సభకు
ఎన్నికయ్యారు. రెండోసారి ఇక్కడ నుంచే 1980 ఎన్నికల్లో విజయం సాధించారు. 

వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ, పట్టాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత బీజేపీతో విబేధించి పార్టీ వీడి, 2004 ఎన్నికల్లో లక్నో పార్లమెంటు స్థానం నుంచి వాజ్‌పేయి ప్రత్యర్థిగా పోటీచేశారు. తిరిగి 2010లో బీజేపీలో చేరిన ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 నవంబరులో న్యాయవాది వృత్తి నుంచి తప్పుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారుడు మహేశ్ జఠ్మలానీ కూడా ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.