సుజీత్ కు అస్వస్థత

సాహోతో గొప్ప దర్శకుడు అనిపించుకొనే అవకాశం యువ దర్శకుడు సుజీత్ కి దక్కింది. సాహో బ్లాక్ బస్టర్ హిట్ అయితే సుజీత్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. కానీ, సాహో అంచనాలని అందుకోలేకపోయింది. మంచి టాలెంట్, భారీ బడ్జెట్, విలువైన సమయాన్ని సుజీత్ వేస్ట్ చేశాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సాహో టాక్ తో సుజీత్ నిరాశలోకి వెళ్లినట్టు టాక్.

తాజాగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సుజిత్ కి డెంగు సోకింది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుజీత్ ఆసుపత్రి కి వెళ్లగా పలు టెస్టులు నిర్వహించి డాక్టర్లు అది డెంగు అని నిర్ధారించారు. సుజీత్ ఒంట్లో బ్లడ్ ప్లేట్లెట్స్ అన్నీ తగ్గిపోయాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సుజిత్ ని వాళ్ళ అమ్మగారు దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారమ్. 

సుజీత్ దర్శకత్వం వహించిన రెండో సినిమా సాహో. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. నాన్ బాహుబలి పదాన్ని తుడిపేస్తుందని భావించిన సాహో.. సాదాసీదా అనిపించుకుంది.