వైరల్ : బస్టాండ్’లో సాయిపల్లవి.. ఎవ్వరూ గుర్తుపట్టలేదు !

హీరోయిన్స్ బయట కనిపిస్తే.. అంతే సంగతులు. వాళ్ల చుట్టూ జనం గుమికూడేస్తారు. అదే అదనుగా ఆకతాయిలు చెత్తపనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకొన్నాయి. ఇక, తెలంగాణ పోరిగా ప్రేక్షకులని ఫిదా చేసిన సాయిపల్లవి బయటకనిపిస్తే ఊరుకొంటారా ? కానీ సాయిపల్లవి బస్టాండ్ లో కనబడినా.. ఎవరూ పట్టించుకోలేదు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ గా మారింది. 

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాట్ పర్వం’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వరంగల్ జిల్లాలోని పరకాలలో జరుగుతోంది. అక్కడ బస్టాప్ లో సాయి పల్లవి బస్సు ఎక్కే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం ఎలాంటి హడావుడి చేయకుండా..  ఎవరికీ కనపడకుండా ఓ కెమెరాను పక్కనే ఉన్న హోటల్ లో పెట్టి షూటింగ్  చేయడం మొదలు పెట్టింది. బ్యాగ్ తో సాయిపల్లవి బస్టాప్ లోకి వచ్చి అక్కడి బల్లపై కొద్దిసేపు కూర్చొంది. 

అయినా ఆమె పక్కన ఉన్న వారెవరూ ఆమెను గుర్తించలేదు. ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. సాయి పల్లవి ఓ సాధారణ ప్రయాణికురాలిలాగే బస్టాప్ కు చేరుకోవడం, అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈ తతంగాన్నంతా ఆ పక్కనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో ని మీరు చూసేయండీ.. !