చిరు, పవన్ లని పక్కనపెట్టేసిన వరుణ్ తేజ్ !


మెగా యంగ్ హీరోలు.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లని ఫాలో అవుతుంటారు. కుదిరితే వారి సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ రిమేక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ సినిమాల కోసం మెగాస్టార్ పలు హిట్స్ సాంగ్స్ రిమేక్ చేయబడ్డాయి. అవి మెగా అభిమానులని బాగానే అలరించాయి.  ఐతే, వరుణ్ తేజ్ మాత్రం మెగా, పవర్ స్టార్ లని పట్టించుకోవడం లేదు. ఆయన తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. 

ఇందులో వరుణ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. నాటు పాత్రలో వరుణ్ చక్కగా ఒదిరిపోయాడని సోమవారం విడుదలైన ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో ఓ రిమేక్ సాంగ్ ఉందట. అలా అని అది మెగాస్టార్ సాంగ్, పవర్ స్టార్ సినిమాలోని సాంగ్ కాదు. సోగ్గాడు శోభన్ బాబు-శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ సినిమాలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మా.. ‘ సాంగ్. 

ప్రత్యేకంగా ఈ సాంగ్ నే ఎంచుకోవడంపై దర్శకుడు  హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. కమర్షియల్ గా ఆలోచించి ఉంటే మెగాస్టార్ లేదా పవర్ స్టార్ సాంగ్ ని ఎంచుకొనేవాళ్లం. సందర్భానికి సరిపోయే సాంగ్ కాబట్టి దేవత సినిమాలోని సాంగ్ ని ఎంచుకొన్నాం. ఈ సాంగ్ పై ఎన్నైనా అంచనాలు పెట్టుకోండి. వాటిని కచ్చితంగా అందుకుంటుంది అన్నారు హరీష్. తొలిప్రేమ, ఫిదా లాంటి రొమాంటిక్ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ ఓ మాస్ పాత్రని అంగీకరించడం గొప్పవిషయం. ఆయనకి థ్యాంక్స్ అన్నారు హరీష్.