‘ప్రతిరోజు పండగే’ ప్రీ లుక్ చూశారా.. ? 

‘చిత్రలహరి’తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతిరోజు పండగే’. మారుతి దర్శకుడు. రాశీఖన్నా కథనాయిక. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. రేపు ఫస్ట్ లుక్ ని వదలనున్నారు. ఈ చిత్రానికి ‘వేలు విడవని బంధం’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో ఇది తండ్రి సెంటిమెంట్ తో తెరకెక్కుతోన్న చిత్రం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తెలుస్తోంది. 

వాస్తవానికి వరుసగా మాస్, యాక్షన్ చిత్రాలని తేజు అభిమానులకి బోర్ కొట్టించాడు. ఈ నేపథ్యంలో చిత్రలహరి లాంటి డిఫరెంట్ సినిమా చేసి విజయాన్ని అందుకొన్నారు. ఇకపై కూడా కామెడీ, రొమాంట్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలని మాత్రమే చేయాలని తేజు డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పట్లో తేజు మాస్, యాక్షన్ కథలని ముట్టుకోడు. 

ఇక ప్రతిరోజు పండగే చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అనుకొన్నారు. కానీ సంక్రాంతి రేసులో స్టార్ హీరోలు మహేష్, అల్లు అర్జున్ ఉండటంతో.. క్రిస్మస్ కే పండగ చేసుకోవాలని చూస్తున్నట్టు సమాచారమ్.