తెరాస మాదే.. అందులో పదవులు మావే : నాయిని


గులాభి జెండా అసలైన ఓనర్లమని మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన తెలంగాణ కేబినేట్ విస్తరణలో భాగంగా ఈటెలకి ఉద్వాసన పలకనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈటెల ఆ వ్యాఖ్యలు చేశారు. ఆయనకి ఎమ్మెల్యే రమసమయి నుంచి సపోర్ట్ లభించింది. మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, మరికొందరు నేతలు ఈటెల వ్యాఖ్యలని సపోర్ట్ చేసినట్టు అనిపించింది. తాజాగా నాయిని తెరాస తమదే. అందులోని పదవులు తమవే అన్నారు.

బుధవారం నాయిని మీడియాతో చిట్ చాట్ చేశారు. మీడియాలో వచ్చిన వార్తలపై తనను కేటీఆర్‌ అడిగారు. తాను మీడియాతో ఏదో చిన్నగా చిట్‌చాట్‌ చేస్తే పెద్ద వార్తగా రాశారు. తనని సీఎం పిలిస్తే వెళ్తానని మాట్లాడతానని నాయిని చెప్పుకొచ్చారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్‌ పదవిలో రసం లేదన్న నాయిని.. ఇప్పుడేమో.. ఆర్టీసీ కార్పొరేషన్ పదవి ఇచ్చినా రసం వాళ్లే పోస్తారని వ్యాఖ్యానించడ్ం గమనార్హం.