షాక్ : బిగ్ బాస్ హౌస్ లో దెయ్యాలు

బిగ్ బాస్ హౌస్ లో దెయ్యాలు తిరుగుతున్నాయి. మంగళవారం రాత్రి ఐదు దెయ్యాలు కనిపించాయ్. అవి ఇంటి సభ్యులని చిత్రహింసలు పెట్టేందుకు ట్రై చేశాయి. ఒకరిని చంపాయి కూడా. ఐతే, ఇవి నిజమైన దెయ్యాలు కాదు. లగ్జరీ బడ్జెట్ లో భాగంగా హౌస్ మేట్స్ కి ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో దెయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉంటారు. వీరు ఇంట్లో మిగిలిన వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రాహుల్, రవి, మహేష్‌లకు విసుగుతెప్పించాలి.మనుషులకు విసుగు తెప్పించి.. వాళ్లను చంపాలి. దీనిలో భాగంగా తొలిరోజు ముగ్గుర్ని చంపాల్సి ఉంటుంది.

ఈ టాస్ లో చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా.. చంపిన వాళ్లు మనుషులుగా మారతారు. దెయ్యం అయిన శిల్ప చేతిలో పునర్నవి ప్రాణాలను కోల్పోయింది. ఆమెని నీటిలోకి తీసేసి చంపేశారు. ఐతే, ఈ గేమ్ విషయంలో పునర్నవి బిగ్ బాస్ పై ఫైర్ అయింది. బిగ్ బాస్ ఇది బుల్ షిట్ టాస్క్. అంటూ తనకు వస్తోన్న బూతులు తిట్టింది. మీ ఆటను మీరే ఆడుకోండి. నేను ఈ గేమ్ ఆడను అంటూ బిగ్ బాస్ ని ఏకిపారేసింది. పునర్నవి బిగ్ బాస్ ఇంట్లో ఫైర్ అవ్వడం ఇది తొలిసారి ఏం కాదు. కానీ, ఏకంగా బిగ్ బాస్ పై పున్ను ఫైర్ అవ్వడం మాత్రం ఇదే తొలిసారి. మరీ.. గేమ్ ఆడని పున్నుకి బిగ్ బాస్ ఏం శిక్ష వేస్తారన్నది చూడాలి.