చంద్రబాబు సైకో పేషెంట్‌ !

‘ఛలో ఆత్మకూరు’ని భగ్నం చేయడంలో ఏపీ పోలీసులు విజయవంతం అయ్యారు. తెదేపా నేతలని ఎక్కడికక్కడ గృహ నిర్భంధం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుని ఇంటి నుంచి బయటికిరాలేదు. దాంతో ఆయన కారులోనే నిరసనకి దిగారు. 

మరోవైపు, చంద్రబాబుపై వైకాపా నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు సైకో పేషెంట్‌ అని మంత్రి శంకర్‌నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చిన్న వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్న సైకో చంద్రబాబు, జగన్‌ పాలన విధానాన్ని జీర్ణించుకోలేక పల్నాడు డ్రామా ఆడుతున్నారు. టీడీపీ డ్రామా కంపెనీలా మారిందని విమర్శించారు. 

చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ లను ఉపయోగించుకొని  నాటకాలాడుతున్నారని  వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయనకి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఆయన ఆడుతున్న నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఆత్మకూరు ప్రశాంతంగా ఉంటే చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విష్ణు మండిపడ్డారు. సాగునీటి రాకతో పల్నాడు రైతులంతా ఆనందంగా ఉంటే చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడెల ట్యాక్స్ పేరుతో శివప్రసాదరావు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు.