సప్రైజ్ : జెమినీ టీవీలో చైతూ-రస్మిక సినిమా

ప్రేక్షకులని జెమినీ టీవీ సప్రైజ్ చేసింది. ఇంకా అధికార ప్రకటన రాని సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకొన్నట్టు ప్రకటించింది. నాగ చైతన్య-రష్మిక మందన నటించిన ‘అదే నువ్వు, అదే నేను’ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకొన్నట్టు జెమినీ టీవీ ట్విట్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా అప్ డేట్ బయటకి రాలేదు. దర్శకుడు ఎవరు ? ఏ బ్యానర్ లో తెరకెక్కుతోంది అనే విషయాలు తెలీదు. అలాంటి సినిమా టైటిల్ ప్రకటిస్తూ శాటిలైట్ రైట్స్ కొనేసినట్టు ప్రకటించుకొంది. 

జెమినీ టీవీ ఇచ్చిన మరో సప్రైజ్ ‘ఇద్దరిదీ ఒక్కటే లోకం’. కనీసం ఈ టైటిల్ ఇప్పటికే బయటికి పొక్కింది. కానీ సినిమా అప్ డేట్స్ ఏమీ బయటకు రాలేదు. సాధారణంగా సినిమా రిలీజ్ ముందు సినిమా శాటిలైట్ రైట్స్ ఎవరు తీసుకొన్నారు అనే విషయం బయటకి వచ్చేది. అప్పటి ఆ సినిమా ప్రమోషన్స్ స్వింగ్ లో ఉన్న కారణంగా కొత్త సినిమా ఏ టీవీలో రాబోతుందనేది ప్రేక్షకుడికి గుర్తుండిపోయింది. ఇప్పుడేమో సినిమా ఎనౌన్స్ చేసినట్టుగా శాటిలైట్ రైట్స్ ని ప్రకటించడం విశేషం.