రాహుల్ పై వేటు గిల్ కు చోటు  


దక్షిణాఫ్రికాతో 3టెస్టుల సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఊహించినట్టుగానే ఓపెనర్ కేఎల్ రాహుల్’పై వేటు పడింది. ఆయన స్థానంలో మంచి ఫామ్ లో ఉన్న యువ క్రికెటర్ శుభమన్ గిల్ ని తీసుకొన్నారు. దక్షిణాఫ్రికా-ఏపై అన్ని ఫార్మాట్ల లోనూ రాణించిన శుభమన్ గిల్ కు రాణించిన సంగతి తెలిసిందే. ఇక, టెస్టుల్లో టీమిండియాకు ఓపెనింగ్ సమస్య తీరడం లేదు. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ శర్మని టెస్టుల్లోనూ ఓపెనింగ్ కి దించనున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ లో రోహిత్ ఓపెనింగ్ చేయనున్నారు. 

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు :  విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సహా( వికెట్ కీపర్), పుజారా, మయాంక్ అగర్వాల్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్ కు జట్టులో స్థానం దక్కింది.