మహేష్ స్వీట్ మెమోరి !

లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో స్వీట్ మెమోరిని గుర్తుచేసుకొన్నాడు సూపర్ స్టార్ మహేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11యేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. ఆమె తాజా షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఉద్దేశించి మహేష్ ట్వీట్ చేశారు.

మహేష్ తండ్రి, సీనియర్ సూపర్ స్టార్ కృష్ణతో కలిసి పలు సినిమాల్లో నటించింది. అందులో ‘కొడుకు దిద్దిన కాపురం’ కూడా ఒకటి. ఇందులో మహేష్ కూడా నటించారు. ఆ చిత్ర సెట్స్ లో విజయశాంతితో దిగిన ఫొటోను తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు మహేష్. ‘1989లో ఇక్కడే మా జర్నీ ప్రారంభమైంది. అదే కొడుకు దిద్దిన కాపురం. మళ్లీ 30ఏళ్ల తర్వాత విజయశాంతిగారితో పనిచేస్తున్నా. జీవితం అనేది నిజంగా చక్రంలాంటిది’ అని రాసుకొచ్చారు. మహేష్ షేర్ చేసిన ఫోటో, ఆయన పెట్టిన కామెంట్స్ ఆకట్టుకొంటున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరూ ప్రేక్షకుల ముందుకు రానుంది.