పీతల సుజాతకు పితృ వియోగం


మాజీ మంత్రి, తెదేపా మహిళా నేత పీతల సుజాత తండ్రి పీతల బాబ్జి కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. తండ్రి భౌతికకాయం వద్ద సుజాత బోరున విలపించడం అక్కడున్నవారి అందరి చేత కంటతడిపెట్టించింది. తండ్రి వారసత్వంగానే పీతల సుజాత రాజకీయాల్లోకి వచ్చారు.  2014 సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. చంద్రబాబు కేబినేట్ లో మంత్రిగా పనిచేశారు.