హైదరాబాద్ లోనే ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. !

‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కర్నూలులో చేయాలని అనుకొన్నారు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రేనాడు ప్రాంతానికి చెందిన వాడు. అది ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో ఉంది. ఆ ప్రాంతంలో సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేస్తే సందర్భోచితంగా ఉంటుందని భావించారు. అంతేకాదు.. సైరా ఫంక్షన్ కోసం విజయవాడ, వైజాగ్ పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్ గా హైదరాబాద్ లోనే సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. రాకపోకలకి  ఇబ్బంది ఉండదనే హైదరాబాద్ లో ఫిక్స్ చేశారు.

సైరా ప్రీ రిలీజ్ కు ప్రముఖులంతా వస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు హాజరుకానున్నారు. అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం హైదరాబాద్ లోనే ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఫంక్షన్ ఎప్పుడు ? హైదరాబాద్ లో ఎక్కడ ?? అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ప్రకటన రావొచ్చు.

ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిరు సరసన నయనతార నటించింది. కిచ్చ సుధీప్, జగపతిబాబు,  తమన్న, అనుష్క తదితరులు కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.