కేటీఆర్ ముఖ్య అతిథిగా సైరా ప్రీ రిలీజ్ వేడుక

సైరా ప్రీ రిలీజ్ వేడుకకి డేటు ఫిక్సయింది. ఈ నెల 18న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ముందు సైరా వేడుకని కర్నూలులో నిర్వహించాలని భావించారు. కానీ ప్రముఖుల రాకకి ఇబ్బంది ఎదురవుతుందని హైదరాబాద్ లోనే ప్రీ రిలీజ్ వేడుకని ఫైనల్ చేశారు. 

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఆయనతో పాటు దర్శకధీరుడురాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివ రాబోతున్నట్టు నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్ చేసింది. సైరా చిత్రబృందం మొతం, మెగా ఫ్యామిలీ, మెగా హీరోలు సైరా ఫంక్షన్ కి రాబోతున్నారు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవికి ఇస్తున్న కానుక సైరా. అందుకే ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సినిమా కోసం ఖర్చు చేశారు. సినిమా ఫంక్షన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. తొలి తరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో చిరు నరసింహారెడ్డిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చ సుధీప్, తమన్నా, అనుష్క, నయనతార కీలక పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా