ఇద్దరు మెగాస్టార్స్ మధ్య శిరీష్.. అదిరింది !

అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ చక్కిటి ఫోటోని అభిమానులతో పంచుకొన్నారు. టాలీవు, బాలీవుడ్ మెగాస్టార్స్ చిరంజీవి, అమితాబ్ ల మధ్య శిరీష్ నిల్చొని దిగిన ఫోటో అది. సైరా షూటింగ్ సెట్ లో దిగిన ఈ ఫోటోని తాజాగా శిరీష్ ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ నెల 18 హైదరాబాద్ లోని ఎల్భీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించనున్నారు. ఈ వేడుకకి అతిథులుగా తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వి.వి. వినాయక్ హాజరు కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కేటీఆర్ రావడం లేదని క్లారిటీ ఇచ్చింది. కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారని చిత్రబృందం తెలిపింది