అనుష్క ఎమోషనల్ ముద్దు చూశారా.. ? 


ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మైదానంగా పేరు మార్చారు. అంతేకాదు.. ఈ స్టేడియంలోని ఓ స్టాండ్‌కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరుని పెట్టారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి విరాట్ కోహ్లీ దంపతులు హాజరయ్యారు. స్టాండ్ కి కోహ్లీ పేరు ప్రకటించగానే కోహ్లీ పక్కనే కూర్చున్న అతని భార్య అనుష్క శర్మ ఎమోషనల్ అయింది. కోహ్లీ చేతిని ముద్దాడింది. ఆ సమయంలో విరాట్ కూడా భావోద్వేగానికి గురై అనుష్క చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడీ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.