పీవీ సింధుకు సీఎం జగన్ కానుక.. ఏంటో తెలుసా ?


తెలుగు తేజం పీవీ సింధుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ భారీ నజరానా ప్రకటించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తర్వాత సింధు తొలిసారిగా సీఎంని కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సింధుని సత్కరించారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు ఐదు ఎకరాలు కేటాయిస్తామని సీఎం చెప్పారని పీవీ సింధు తెలిపారు. అంతకుముందు పీవీ సింధు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసింది. ఈ సందర్భంగా గవర్నర్ సింధుని సత్కరించారు.