జిగిత్యాలలో మంత్రులకి చేధు అనుభవం

తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ కు జగిత్యాలలో చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు జగిత్యాలలోని  హిమ్మత్ రావు పేటకు వెళుతుండగా, వీరి కాన్వాయ్ ని రాంసాగర్ చౌరస్తా వద్ద కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలు, రైతులు అడ్డుకున్నారు.  తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొండగట్టు ప్రమాద బాధితులు తమకి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరు కుటుంబాలకు అందాల్సిన పరిహారం, ఇంటికో ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. అదే సమయంలో రైతులు కూడా మంత్రులపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సర్దిచెప్పినా రైతులు వినిపించుకోలేదు. దీంతో 15-20 నిమిషాల పాటు మంత్రులు కొండగట్టు బాధితుల మధ్య చిక్కుకుపోయారు. చివరికి పోలీసులు రంగం ప్రవేశం చేసి పరిస్థిని చక్కదిద్దారు. ఐతే, అక్కడికక్కడే మంత్రులు తమకి న్యాయం చేస్తారని భావించిన కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు, రైతులకి నిరాశే ఎదురైంది.