మహేష్ ఏమాత్రం మారలేదు : విజయశాంతి


అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11యేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. ఆమె తాజా షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఉద్దేశించి మహేష్ ట్వీట్ చేశారు. ‘1989లో ఇక్కడే మా జర్నీ ప్రారంభమైంది. అదే కొడుకు దిద్దిన కాపురం. మళ్లీ 30ఏళ్ల తర్వాత విజయశాంతిగారితో పనిచేస్తున్నా. జీవితం అనేది నిజంగా చక్రంలాంటిది’ అని రాసుకొచ్చారు. మహేష్ ట్విట్ కి విజయశాంతి రిప్లై ఇచ్చింది. మహేష్ వ్యక్తిత్వంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

“కాలగమనంలో సాధారణంగా అయితే ప్రకృతి మార్పును తీసుకొస్తుంది. కానీ మహేష్ బాబుగారి వ్యక్తిత్వంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆయన మనసే ఆయనకు గొప్ప అభరణం.1989లో మా కాంబినేషన్ మొదలవ్వడానికి ముందు.. ఇదే రోజు 1980‌లో ‘కిలాడీ కృష్ణుడు’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణగారితో జంటగా నా సినీ ప్రయాణం మొదలైంది. కళ అనేది అనంతం. అది మీలాంటి వారి వల్ల భ్రమణం చేస్తుంది” అంటూ రీ ట్విట్ చేసింది లేడీ సూపర్ స్టార్.

‘సరిలేరు నీకెవ్వరూ’లో మహేష్ లో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్. ఓ ప్రత్యేక గీతం కోసం తమన్నా, పూజా హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరూ ప్రేక్షకుల ముందుకు రానుంది.