ఆసుపత్రిని శుభ్రం చేసిన అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా చేత చీపురు పట్టారు. ఢిల్లీ ఎయిమ్స్ లో గదుల కారిడార్ ను ఊడ్చారు. ఆయన పాటు బీజేపీ వర్కింగ్‌
ప్రెసిడెంట్‌ జెపి నడ్డా కూడా ఆసుపత్రిని శుభ్రం చేశారు. ఈనెల 17న ప్రధాని మోడీ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు సమాజ సేవ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అమిత్ షాతో సహా భాజపా నేతలు శనివారం ఎయిమ్స్ లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎయిమ్స్ లోని రోగులకు ఆహారం, పండ్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు సేవా సప్తాహ్ ను నిర్వహిస్తున్నారు. మన ప్రధాని మోదీ తన జీవితాన్ని దేశ సేవకు అంకితమిచ్చారు. పేదల కోసం ఆయన పనిచేస్తున్నారు. అందుకోసం ఆయన పుట్టిన రోజును సేవా సప్తాహ్ పేరుతో నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.