చిరు-పవన్-చరణ్ తో హరీష్ మల్టీస్టారర్ !

మెగా అభిమానులు ‘గబ్బర్ సింగ్’ సినిమాని మర్చిపోరు. దానికి దర్శకత్వం వహించిన హారీష్ శంకర్ ని ఇష్టపడకుండా ఉండరు. పవన్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో హరీష్ సినిమా చేశాడు. ఇక మిగిలింది మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు మాత్రమే. వీరిద్దరితోనూ సినిమాలు చేస్తే మెగా హీరోలందరితోనూ సినిమాలు చేసిన దర్శకుడిగా హరీష్ పేరిట రికార్డు ఉంటుంది. వాల్మీకి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హరీష్ ని ఇదే ప్రశ్న అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు.

“ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడా.. ఎవరితోనూ చెప్పలేదు. సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు కలిసి నటించడానికి అవకాశం వున్న మాంచి కథ తన దగ్గర వుంది” అన్నారు. ఇక  తాను వరుణ్ తేజ్ దారిలోకి వెళ్లి క్లాస్ సినిమా తీద్దాం అనుకున్నానని, అయితే వరుణ్ తాను మీ దారిలోకి వస్తా, మాంచి మాస్ సినిమా ఇవ్వండి అని అడిగడంతో వాల్మీకి సినిమా ప్రయాణం ప్రారంభమైందన్నారు హరీష్. దబాంగ్ ను జిరాక్స్ లా తీసి గబ్బర్ సింగ్ చేయలేదు. జిగర్తాండ కూడా అంతే. మార్పులు, మాటలు తన స్టయిల్ లో ఉంటాయన్నారు.