కోడెల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు


తెదేపా సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మృతిపై పోస్ట్ మార్టమ్ నివేదిక వచ్చేసింది. దాని ఆధారంగా కోడెలది ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్థారించారు. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. మెడ భాగంలో 8 అంగుళాల మేర తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు గుర్తించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఫొరెన్సిక్ వైద్యులు సుమారు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం మొత్తాన్ని పోలీసులు వీడియోలో రికార్డ్ చేశారు.

కోడెలది ఆత్మహత్యగానే భావిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక ప్రకారం తదుపరి విచారణ చేపడతామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. రెండు కెమెరాలతో పోస్టుమార్టం కెమెరాలతో నిర్వహించామన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం కోడెల మృతదేహాన్ని కార్యకర్తల సందర్శనార్థం బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఉంచారు.మరోవైపు, పల్నాడులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144సెక్షన్ విధించారు.