బ్రేకింగ్ : ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత

ఆంధ్రప్రదేష్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన సొంతింట్లో కోడెల ఆత్మహత్యకి పాల్పడ్డారు. అది గమనించిన ఆయన కుటుంబసభ్యులు కోడెలని హుఠాహుఠిన బసవతారకం క్యాన్సర్ హాస్పటిల్ కి తీసుకెళ్లారు. అక్కడ ఆయనికి వెంటిలెటర్స్ పై ఉంచి చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కోడెల కన్నుముశారు.

గత నెలలోనే కోడెలకు గుండెపోటు వచ్చింది. వైకాపా అధికారంలోకి రాగానే కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కోడెల మానసికంగా కృంగిపోయారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆయనకి గతనెలలో గుండెపోటు వచ్చింది. కోలుకున్న తరువాత నుంచీ కూడా ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు.