‘డెవిల్’ మహేష్ కథే.. !


సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ కు వెళ్లి అర్జున్ రెడ్డి రీమేక్ (కబీర్ సింగ్) చేశాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా హిందీలోనే ప్లాన్ చేశాడు. ఇటీవలే రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి మధ్య కథాచర్చలు జరిగాయి. గతంలో సూపర్ స్టార్ మహేష్ కు చెప్పిన డార్క్ క్రైమ్ స్టోరీనే రణబీర్ కు చెప్పాడట. స్టోరీలైన్ నచ్చడంతో రణబీర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘డెవిల్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోంది. 

నిజానికి కబీర్ సింగ్ తర్వాత తెలుగులోనే సినిమా చేయాలనుకున్నాడు సందీప్ రెడ్డి. తే కబీర్ సింగ్ భారీ విజయం సాధించడంతో ఆయనకు బాలీవుడ్ హీరోల నుంచి ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. పైగా తన నెక్ట్స్ సినిమాను మరింత బోల్డ్ గా తీస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బాలీవుడ్ క్రిటిక్స్ కు సవాల్ విసిరాడు సందీప్. అసలైన క్రైమ్ సినిమాని ఎలా ఉంటుందో చూపిస్తానని బాలీవుడ్ మీడియాతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనేంటో మరోసారి బాలీవుడ్ కి చూపించాలనే  కసితో డెవిల్ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు సందీప్. మరీ.. బాలీవుడ్ లో సందీప్ మరో హిట్ కొడతాడేమో చూడాలి.