సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ !

సైరా ప్రీ రిలీజ్ వేదిక విషయంలో గందరగోళం నడిచిన సంగతి తెలిసిందే. ముందుగా కర్నూలులో సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేద్దామనుకొన్నారు. ఆ తర్వాత విజయవాడ, వైజాగ్ పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకని ఫిక్స్ చేశారు. ఈ నెల 18న హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా చేసింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ విడుదలకి సంబంధించి కౌంట్ డౌన్ పోస్టర్స్ ని కూడా వదిలారు. 

లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సైరా ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఈ నెల 18న సైరా వేడుకని క్యాన్సిల్ చేశారు. మళ్లీ ఎప్పుడు ? అంటే క్లారిటీ లేదు. ఈ నెల 22 అనే మాట వినబడుతోంది. ఆ డేటు ఇంకా ఫైనల్ కాలేదు. ఇంతకీ సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎందుకు వాయిదా వేశారు ? అన్నది తెలియాల్సి ఉంది. రాజమౌళి, వినాయక్, పవన్ కల్యాణ్, కేటీఆర్ లాంటి ప్రముఖుల్ని ఈ వేడుకకు ఆహ్వానించారు. కేటీఆర్ రాలేనని ఇప్పటికే స్పష్టంచేశారు. ఇప్పుడు తేదీ మారడంతో.. 22కి ఆయన వస్తారేమో చూడాలి. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. తొలి తరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో చిరు నరసింహారెడ్డిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చ సుధీప్, తమన్నా, అనుష్క, నయనతార కీలక పాత్రల్లో నటించారు. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.