ఎన్టీఆర్, మహేష్ తోనూ ప్రశాంత్ నీల్ సినిమా !

తెలుగు సినిమా దేశం మొత్తం హవా చూపిస్తోంది. బాహుబలి అందుకు పునాది వేసింది. బాహుబలి తర్వాత ఘాజీ, సాహో సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్ ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. రానాకు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ మార్కెట్ ఉంది. రామ్ చరణ్ బాలీవుడ్ లో ఓ సినిమా చేసొచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ బాలీవుడ్ లోనూ రిలీజ్ కానుంది. 

చరణ్, తారక్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులని అలరించనున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, మహేశ్ లు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ మేరకు మహేష్ ప్రయత్నాలు మొదలెట్టినట్టు.. ఓ కథని కూడా ఓకే చేసినట్టు సమాచారమ్. కేజీ ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవలే మహేష్  కి ఓ  కథ చెప్పి ఒప్పించాడట. ఇప్పటికే ఈ దర్శకుడితో ఎన్ టీఆర్ తో ఓకే అయ్యింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత తారక్ సినిమా ఉండనుంది. తారక్ సినిమా తర్వాత మహేశ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ రెండు కూడా ప్యాన్ ఇండియా సినిమాలే.