వైరల్ : బతికుండగానే శవయాత్ర


వర్షాలు పడాలి. కరువుపోవాలంటే కప్ప తల్లి ఆట ఆడటం చూశాం. మరీ.. భారీ వర్షాలు తగ్గి, వరదలు తగ్గుముఖం పట్టాలంటే కూడా ఇలాంటి నమ్మకాలు ఏమైనా ఉన్నాయా ? అంటే ఉన్నాయి. షాజాపుర్‌లోని కాళీ సింధ్‌లో ఇటీవల భారీ డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ జరిగిన అంతిమయాత్ర ఒకటి అందరి దృష్టినీ ఆకర్షించింది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలు నిలిచిపోతాయన్న నమ్మకంతోనే ఇలా చేశారట. ఇప్పుడీ న్యూస్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్టు.. పాడెమీదున్న వ్యక్తి హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. బతికుండగానే అంతిమ యాత్ర చూడటం అంటే ఇదేనేమో.. !