దక్షిణాఫ్రికాతో రెండో టీ20 టీమిండియా ఈజీ విన్ !

మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా సులభంగా గెలుపొందింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా మరో ఓవర్ మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 72 నాటౌట్ ( 52 బంతులలో 4 ఫోర్లు, 3 సిక్సులు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో పెహల్కువయో, షంసి, ఫోర్టిన్ తలో వికెట్ తీశారు.