ఒక్కో సింగరేణి కార్మికుడికి లక్ష దసరా బోనస్

సింగరేణి కార్మికులకి సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. దసరా కానుకగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1,00,899 బోనస్ చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. 2017-18లో లాభాల్లో కార్మికులకు 27 శాతం బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 28శాతానికి పెంచారు. దీంతో ప్రతి కార్మికుడు గత ఏడాది కంటే రూ.40,530 అదనంగా పొందనున్నారు.

సింగరేణిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ అనిర్వచనీయం. ప్రతి ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతోంది. లాభాలు పెరుగుతున్నాయి. 2018-19 సంవత్సరానికి రూ.1565 కోట్ల గరిష్ఠ లాభాన్ని సింగరేణి సంస్థ ఆర్జించిందని వెల్లడించారు. ఇక, పోలీసులకు వారాంతపు సెలవులు అంతసులువు కాదనీ, అయినప్పటికీ ఈ విషయమై డీజపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నామని తెలిపారు