నాగార్జున పొలంలో కుళ్లుపోయిన డెడ్ బాడీ.. ఎవరిదీ ?


టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున పొలంలో మృతదేహం దొరకడం కలకలం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం పాపిరెడ్డి గూడలో నాగ్ కు 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈ వ్యవసాయం క్షేత్రంలో ఉన్న ఓ గదిలో కుళ్లిపోయిన మృతదేహం బయటపడటం పెద్ద మిస్టరీగా మారింది. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదీ ? అక్కడకి ఎలా వచ్చింది ?? అన్నది తెలియాల్సి ఉంది.

తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం చేయాలని నాగ్ నిర్ణయించుకొన్నారు. ఇందుకోసం నిపుణులని అక్కడికి పంపించారు. వారు పొలంను పరిశీలిస్తున్న క్రమంలో ఓ గదిలోకి వెళ్లి చూడగా కుళ్లిపోయి ఉన్న మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు అక్కడే పోస్ట్ మార్టమ్ చేయించారు. మృతదేహం దొరికిన గదిని సీజ్ చేశారు. చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే.. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.